- బోరబండలో ఘటన
జూబ్లీహిల్స్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరులు తనను వేధిస్తున్నారని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బోరబండ డివిజన్ సాయిబాబానగర్కు చెందిన శ్రీనివాస్ గౌడ్(48) స్థానిక హోటల్లో పనిచేస్తున్నాడు. కొన్నాళ్లుగా వారి బంధువుల మధ్య బాబా శైలాని నగర్లో ఉన్న ఆస్తి తగదాను ఆసరాగా చేసుకుని శ్రీనివాస్ను బీఆర్ఎస్కు చెందిన లీడర్లు ప్రశాంత్, సాయిచరణ్, డి.రాజు కలిశారు.
వివాదాన్ని పరిష్కరించి, ఆ స్థలాన్ని అమ్మిపెడతామని చెప్పారు. ఆస్తి వివాదం కొలిక్కి వచ్చిన తర్వాత శ్రీనివాస్ను డబ్బుల కోసం డిమాండ్చేశారు. దీంతో వారి వేధింపులు భరించలేక శ్రీనివాస్ శుక్రవారం అర్ధరాత్రి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు బాధిత కుటుంబసభ్యుల ఇచ్చిన ఫిర్యాదుతో బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు సీఐ వీరశేఖర్ తెలిపారు.
