తిరుమలలో గోల్డ్ మ్యాన్ ప్రత్యక్షమయ్యాడు. అతని ఒంటి నిండా బంగారు ఆభరణాలే. ఎవరతను? ఒంటిపై ఎన్ని కిలోల నగలున్నాయి?
నగలంటే ఇష్టపడే వారిలో ఎక్కువగా ఆడవారే ఉంటారు. ఆడవారి అందానికి నగలు ముఖ్యం. నగల కోసం భర్తను పీడించేస్తూ ఉంటారు. మగవారు అయితే తక్కువగానే బంగారాన్ని వేసుకుంటూ ఉంటారు. చేతికి ఉంగరమో... లేకుంటే చైన్ లాంటిది. కానీ తిరుమలలో బంగారు బాబు ప్రత్యక్షమయ్యాడు. ఒళ్ళంతా బంగారంతో భక్తులను ఆశ్చర్యపరిచాడు.
తిరుమలలో నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. బుధవారం (జనవరి 17) ఓ భక్తుడు శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చాడు. అతడిని చూసి అంతా షాకయ్యారు. అతని ఒంటి నిండా బంగారు ఆభరణాలున్నాయి. ఆ భక్తుడిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు మిగతా భక్తులు.
హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న మధుసూదన్ ... జనవరి 17 న తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. చేతి వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, కుడి చేతికి భారీ కంకణం, మెడలో పెద్ద చైన్లతో పాటుగా నరసింహ స్వామి., పులి గోర్లను కలిగిన డాలర్లను వేసుకున్నారు. 1.5 కేజీల బరువు గల బంగారు అభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు మధుసూదన్. ఆయన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు రెండు హోటల్స్ నడుపుతున్నట్లు తెలిపారు. తిరుమలలో మదుసూదన్ ఫోటోస్ ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. వామ్మో ఇన్ని ఆభరణాలతో తిరుమల వెళ్లారా అని అంతా అవాక్కవుతున్నారు.
హైదరాబాద్లో పేరు గాంచిన వ్యాపార వేత్త మధుసూదన్ . ఈరోజు(జనవరి 17) ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. అయితే సాంప్రదాయం ప్రకారం పంచెతో దర్శించుకోవాలి. మధుసూదన్ పంచె, బనియర్ను ధరించాడు. షర్ట్ వేసుకోకుండానే ఆలయంలోకి ప్రవేశించాడు. అయితే మధుసూదన్ మెడలో 1.5 కిలోల బంగారం కనిపించింది. అలాగే పదివేళ్ళలో ఎనిమిది వేళ్ళకు బంగారు ఉంగరాలు ఉన్నాయి. మధుసూదన్ ను చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. ఆలయంలో పనిచేసే టిటిడి ఉద్యోగులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.