ఈటలపై అభిమానం చాటుకున్న యువకుడు

ఈటలపై అభిమానం చాటుకున్న యువకుడు

కరీంనగర్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పై ఓ యువకుడు తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు. కామారెడ్డి జిల్లా కు చెందిన రాజు అనే యువకుడు ఈటల రాజేందర్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈటల రాజేందర్ బొమ్మతోపాటు.. బాస్ అని రాయించుకున్నాడు రాజు. వాటిని ఫోటోలు, వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో స్థానికంగా వైరల్ అవుతున్నాయి.