కరోనాతో కొడుకు.. గుండెపోటుతో  తల్లి మృతి

కరోనాతో కొడుకు.. గుండెపోటుతో  తల్లి మృతి

యాదగిరిగుట్ట/తుర్కపల్లి, వెలుగు: కరోనాతో కొడుకు మృతిచెందిన మూడు రోజులకే గుండెపోటుతో తల్లి మృతిచెందింది. ఈ ఘటన యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త చనిపోవడంతో కొడుకు కోట కుమార్ తో కలిసి కోట ఎల్లమ్మ(65) కొన్నేండ్లుగా తుర్కపల్లిలో నివాసం ఉంటోంది. ఈమె వికలాంగురాలు కావడంతో కొడుకు మీదే ఆధారపడింది. ఈ నెల 19న కోటకుమార్(29)కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో  ఈ నెల 21న మృతిచెందాడు. అటు భర్త లేకపోవడం, ఎదిగిన కొడుకు చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఎల్లమ్మ శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు గుండెపోటుతో మరణించింది. రెండు రోజుల వ్యవధిలో తల్లీకొడుకు చనిపోవడంతో బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.