1,276 పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఈ నెల 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు సొసైటీల పరిధిలోని 1,276 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఎస్సీ వెల్ఫేర్ లో 346 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్లో 147 పోస్టులు, బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో 786 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆయా పోస్టులకు ఈనెల 24 నుంచి వచ్చే 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ పరీక్షలను ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్లైన్లో నిర్వహించనున్నారు. ఈ 1,276 పోస్టుల్లో 966 పోస్టులను మహిళకు కేటాయించారు.