బిల్డిండ్ కూల్చివేతలో అద్దెకు ఉంటున్న వ్యక్తి మృతి

బిల్డిండ్ కూల్చివేతలో అద్దెకు ఉంటున్న వ్యక్తి మృతి

హైదరాబాద్ లో ఓ పాత భవనం కూల్చివేస్తున్న ఘటనలో విషాదం చోటుచేసుకుంది. కూకట్ పల్లిలోని  ముసాపేట్ ప్రాంతంలో మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రవణ్ కు సంబంధించిన బిల్డిండ్ పాతబడింది. భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించుకున్న శ్రావణ్ అందులో అద్దెకు ఉంటున్న స్వామి రెడ్డిని బుధవారం ఉదయం ఖాళీ చేయించాడు. బిల్డింగ్ డిమాలేషన్ ఓ కాంట్రాక్టర్ కు అప్పగించాడు. ఇళ్లు ఖాళీ చేసిన విషయాన్ని మరిచి స్వామి రెడ్డి  నిన్న రాత్రి  ఇంట్లోకి వచ్చి పడుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేరనుకోని ఈ రోజు ఉదయాన్నే 2 గంటల సమయంలో కాంట్రాక్టర్ బిల్డింగ్ కూల్చి వేసే పనులు ప్రారంభించాడు. డిమాలేషన్ పనుల్లో స్వామి రెడ్డి మృతి చెందాడు.