
- నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో ఘటన
నార్కట్ పల్లి, వెలుగు: ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి భారీగా మంటలు వ్యాపించిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులోని శ్రీపతి ఫార్మా కంపెనీలో శుక్రవారం ఒక్కసారిగా రియాక్టర్ పేలి మంటలు ఎగసిపడ్డాయి. గ్రామస్తులు భయాందోళన చెంది డయల్100కి ఫోన్ చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ చిట్యాల పోలీసులను అప్రమత్తం చేశారు. నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ నాగరాజు, స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బందితో వెళ్లి మంటలను ఆర్పివేశారు. కంపెనీ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.