
ఏపీ,తెలంగాణ చరిత్రలో 1,33,494 పర్మినెంట్ ఉద్యోగాల కల్పన ఓ రికార్డ్ అని అన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. మొత్తం 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నామని ట్విట్టర్లో తెలియజేశారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పు కోసం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నామని..వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నామన్నారు. మీ అందరి ఆశీర్వాద బలంవల్లే ఇది సాధ్యమవుతోందన్నారు జగన్.