ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా వాసి మృతి

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా వాసి మృతి

బోయినిపల్లి, వెలుగు: జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిష్త్వార్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బల్ల అనిల్ మృతి చెందాడు. గ్రామానికి చెందిన అనిల్ గత 10 ఏండ్లుగా ఆర్మీలో టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.

అనిల్ ఇటీవల 45 రోజుల లీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గ్రామానికి వచ్చి 10 రోజుల కింద తిరిగి డ్యూటీకి వెళ్లాడని, ఈలోపు ప్రమాదంలో మృతి చెందాడని వెల్లడించారు. హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమాదంలో అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీవ్ర గాయాలయ్యాయని మొదట ఆర్మీ అధికారులు ఫోన్ చేసి చెప్పారని, తర్వాత మరోసారి కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చనిపోయాడని చెప్పినట్లు మృతుడి అన్న శ్రీనివాస్ తెలిపారు. అనిల్ మృతి విషయం తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భార్య సౌజన్య, ఇద్దరు కొడుకులు అయాన్, ఆరో ఉన్నారు