కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మహిళా కూలీలు మృతి

కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మహిళా కూలీలు మృతి

మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై పని చేస్తున్న కూలీలను డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందారు. చనిపోయిన వారిలో లింగమ్మ (42) , తిరుపతమ్మ (43) ఉన్నారు. మృతులు బీరంగూడ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. 

ఈ ప్రమాదాన్ని చూస్తూ.. ఓ వ్యక్తి టాటా ఏస్ వాహనం నడుపుతుండగా మరో ప్రమాదం జరిగింది. నిర్లక్ష్యంగా టాటా ఏస్ వాహనం నడపడంతో వాహనం బోల్తా పడింది. మొదటి ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లో ఈ ప్రమాదం జరిగింది. 

విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. ఇద్దరు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు.