![1,153 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్](https://static.v6velugu.com/uploads/2024/04/51_8CwzU1pX2I.jpg)
హైదరాబాద్, వెలుగు : ఎన్నికల విధులపై ఇస్తున్న శిక్షణకు గైర్హాజరైన సిబ్బందికి హైదరాబాద్జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ షోకాస్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలోని పీఓ, ఏపీఓలకు 15 కేంద్రాల్లో రెండు రోజులు ఎన్నికల శిక్షణ ఇస్తున్నారు. సోమవారం ప్రారంభమైన క్లాసులకు 6 వేల మందిలో 1,153 మంది గైర్హాజరయ్యారు. స్పందించిన కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే సీరియస్ యాక్షన్ఉంటుందని హెచ్చరించారు.