ఈ మామిడి పండు ధర రూ.18 వేలు

ఈ మామిడి పండు ధర రూ.18 వేలు

ఇండియాలో అత్యంత ఖరీదైన మామిడి కిలో ధర రూ. 500 మించదు. జపాన్ కు చెందిన ఒక మామిడిపండు ధర ఏకంగా 230 డాలర్లు (దాదాపు రూ. 18 వేలు) పలుకుతోంది. ఈ పండ్లను జపాన్‌‌‌‌లోని టోకాచీ జిల్లాలో 2011 నుండి హిరోయుకి నకగావా అనే రైతు చలికాలంలో కూడా ప్రత్యేక పద్ధతిలో పండిస్తున్నారు.

ఇవి సంప్రదాయ మామిడి పండ్ల కంటే చాలా తియ్యగా ఉంటాయి. ఈ మామిడికి "హకుగిన్ నో తైయో" అని పేరు పెట్టారు. అంటే "మంచులో సూర్యుడు" అని అర్థం. వీటిని మైనస్​8 ఎనిమిది డిగ్రీల చలిలో పండిస్తారట.