అయోధ్య రామునిపై ప్రత్యేక పాట.. రిలీజ్ చేసిన బీజేపీ రాష్ట్ర నాయకుడు

అయోధ్య రామునిపై ప్రత్యేక పాట.. రిలీజ్ చేసిన బీజేపీ రాష్ట్ర నాయకుడు

బషీర్ బాగ్, వెలుగు: అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఎందరో మహనీయులు ప్రాణ త్యాగాలు చేశారని.. వీటి గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ వైస్ చైర్మన్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మల్క కొమురయ్య అన్నారు. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీరామునిపై రూపొందించిన ప్రత్యేక పాటను లక్డీకపూల్ లోని  ఓ హోటల్ లో ఆయన రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  పాటలో శ్రీరాముని వైభవంతో పాటు మందిర నిర్మాణంలో భాగస్వాములైన కర సేవకుల గురించి బాగా వివరించారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. బీజేపీ అధిష్టానం అవకాశం కల్పిస్తే గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు. పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సీఈవో మల్కా యశస్వి పాల్గొన్నారు.