పద్మారావునగర్, వెలుగు : చిన్నారికి అరుదైన, క్లిష్టమైన సర్జరీని గాంధీ ఆస్పత్రి పీడియాట్రిక్డాక్టర్ల టీమ్ విజయవంతంగా నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా బైరామల్గూడ కు చెందిన బాలిక మైథిలి(8) రెండేండ్లుగా విపరీతమైన దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతుంది. చికిత్స కోసం బాలిక తల్లిదండ్రులు సిటీలోని పలు ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోగా చివరికి గత నెలలో గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐలతో పాటు డయాగ్నోస్టిక్ చేసిన డాక్టర్లు బ్రోంకోజెనిక్ సిస్ట్తో బాలిక బాధపడుతున్నట్లు గుర్తించారు.
అసహజ రీతిలో విండ్పైప్, గుండె రక్త నాళాల మధ్య ప్రమాదకరంగా పెరిగిన కణితిని తొలగించేందుకు డాక్టర్లు ఒక చాలెంజ్ గా తీసుకుని సర్జరీని నిర్ణయించారు. పలు రకాల మెడికల్ టెస్ట్ లు చేసిన తర్వాత గత నెల 29న పీడియాట్రిక్ సర్జరీ హెచ్ వోడీ ప్రొ.డా. కె.నాగార్జున ఆధ్వర్యంలో డాక్టర్ల టీమ్ బాలికకు ఎలాంటి కోత లేకుండా థోరాకాస్ స్కోపిక్ఎక్సేషన్ను ఉపయోగించి, రెండు గంటలు శ్రమించి, విండ్ పైప్, గుండె రక్తనాళాలు దెబ్బతినకుండా బ్రోంకోజెనిక్ సిస్ట్ సర్జరీని సక్సెస్ చేశారు. క్లిష్టమైన సర్జరీని చేసి, కణితిని తొలగించిన పీడియాట్రిక్ సర్జరీ హెచ్వోడీ
డా.కె.నాగార్జున, డాక్టర్లు ఎస్.శ్రీనివాస్, మనోజ్,అశ్రిత్రెడ్డి, హర్ష, నేహ,ప్రగ్న్యాతో పాటు అనెస్థీషియా ప్రొఫెసర్డా.ఆవుల మురళి, డా.పద్మావతి, డా.రవినాయక్, వైద్య సిబ్బందికి ఆస్పత్రి సూపరింటెండెంట్ప్రొ.రాజారావు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం బాలిక పూర్తిగా కోలుకుందని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు తెలిపారు.