అమెరికాలోని ఆలయం​లో చోరీ

అమెరికాలోని ఆలయం​లో చోరీ

న్యూయార్క్: అమెరికాలోని హిందూ టెంపుల్​లో చోరీ జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని పార్క్‌‌‌‌వే పరిసర ప్రాంతంలో గల హరి ఓం రాధా కృష్ణ మందిర్‌‌‌‌లో దుండగులు చొరబడి విరాళాల బాక్స్​ను ఎత్తుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 2:15 గంటలకు ఈ ఘటన జరిగింది. ఆ ఘటన ఆ టెంపుల్​లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్​ అయింది. నలుగురు దుండగులు టెంపుల్​లోకి చొరబడి డోర్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు.

అనంతరం విరాళాల బాక్సును ఎత్తుకొని బయటకు తీసుకెళ్లారు. దానిని ఫెన్సింగ్​పైనుంచి బయటకు విసిరేసి.. ఆపై దానిని తీసుకొని కారులో వెళ్లిపోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని భారతీయలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ చోరీ ఘటనపై శాక్రమెంటో పోలీసు విభాగం దర్యాప్తు చేస్తోంది. కాగా, దీనిని యూఎస్​ఆధారిత న్యాయవాద సంస్థ.. ఉత్తర అమెరికా హిందువుల కూటమి తీవ్రంగా ఖండించింది. ఈ అంశాన్ని చాలా సీరియస్‌‌‌‌గా పరిగణించి, విద్వేషపూరిత నేరంగా పరిశోధించాలని శాక్రమెంటో పోలీసులను కోరింది.