గజ్వేల్లో 45 మంది శంకర్ హిల్స్ బాధితుల నామినేషన్లు

గజ్వేల్లో 45 మంది శంకర్ హిల్స్ బాధితుల నామినేషన్లు

సిద్దిపేట : సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఇవాళ (నవంబర్ 9) మొత్తం 45 మంది నామినేషన్లు వేశారు. వీరంతా హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్  పరిధిలో వట్టి నాగుల పల్లి గ్రామంలో శంకర్ హిల్స్ అసోసియేషన్ మెంబర్స్ గా తెలుస్తోంది. ధరణి పోర్టల్ వల్ల 460 ఎకరాల భూమిని నష్ట పోయామని, తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. వీరితో పాటు జగిత్యాల జిల్లా రైతులు కూడా గజ్వేల్ లో నామినేషన్లు వేశారు.