సమస్యను తీర్చండి.. లేదా చావనివ్వండి

సమస్యను తీర్చండి.. లేదా చావనివ్వండి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: సమస్యనైనా తీర్చండి.. లేదంటే చావడానికి అనుమతైనా ఇవ్వండి అంటూ ఓ బాధితుడు కలెక్టరేట్ ముందు నిరసన తెలిపాడు. మహబూబ్​నగర్​జిల్లా హన్వాడ మండలం బుద్ధారం గ్రామానికి  చెందిన జహంగీర్ కు గ్రామంలో ఎకరం 33  గుంటల భూమి ఉంది. పక్క భూమి పట్టాదారు తన భూమిలోకి వచ్చి సాగు చేయనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని జహంగీర్​ఆరోపించారు. తహసీల్దార్​ఆఫీస్, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. రెండేండ్లుగా తిరిగి తిరిగి విసిగిపోయానని చెప్పారు.

ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ ను కలిసి సమస్య పరిష్కరించాలని లేదా చావడానికి అనుమతి ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు. దీంతో కలెక్టర్ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వపరంగా తగిన న్యాయం చేస్తామని,  అధికారులను భయపెట్టే విధంగా బెదిరింపులకు దిగడం మంచిది కాదని హితవు పలికారు. జహంగీర్ భూమి సర్వే చేసి వెంటనే హద్దులు ఏర్పాటు చేయాలని, అవసరమైతే పోలీసుల సహాయం తీసుకొని సమస్యను పరిష్కరించాలని హన్వాడ తహసీల్దార్​ శ్రీనివాసులును కలెక్టర్ ​ఆదేశించారు.