
హైదరాబాద్ సిటీ, వెలుగు: గవర్నర్ను కలిసేందుకు అనుమతివ్వాలని శుక్రవారం రాజ్భవన్ ఎదుట ఓ మహిళ బైఠాయించింది. సమాచారం అందుకున్న పంజాగుట్ట బ్లూ కోల్ట్స్పోలీసులు రాజ్భవన్వద్దకు వచ్చి ఆమెతో మాట్లాడారు. అపాయింట్మెంట్లేకపోవడంతో అక్కడి నుంచి పంపించివేశారు.
ముంబైలోని తన ప్రాపర్టీని కొందరు లాక్కోవాలని చూస్తున్నారని, ఈ విషయంపై ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని అందుకే గవర్నర్కు చెప్పుకుందామని వచ్చానన్నారు. తాను నగరంలోని అడిక్మెట్లో ఉంటానని, ఎక్కడికి వెళ్లాలో తెలియక గవర్నర్దగ్గరకు వచ్చినట్టు చెప్పారు.