రాజ్భవన్ ఎదుట మహిళ బైఠాయింపు

రాజ్భవన్ ఎదుట మహిళ బైఠాయింపు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గవర్నర్​ను కలిసేందుకు అనుమతివ్వాలని శుక్రవారం రాజ్​భవన్ ఎదుట ఓ మహిళ బైఠాయించింది. సమాచారం అందుకున్న పంజాగుట్ట బ్లూ కోల్ట్స్​పోలీసులు రాజ్​భవన్​వద్దకు వచ్చి ఆమెతో మాట్లాడారు. అపాయింట్​మెంట్​లేకపోవడంతో అక్కడి నుంచి పంపించివేశారు. 

ముంబైలోని తన ప్రాపర్టీని కొందరు లాక్కోవాలని చూస్తున్నారని, ఈ విషయంపై ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని అందుకే గవర్నర్​కు చెప్పుకుందామని వచ్చానన్నారు. తాను నగరంలోని అడిక్​మెట్​లో ఉంటానని, ఎక్కడికి వెళ్లాలో తెలియక గవర్నర్​దగ్గరకు వచ్చినట్టు చెప్పారు.