
అర్ధరాత్రి రోడ్డు బ్లాక్ చేసినందుకు 8 మందిపై కేసు
ఉప్పల్, వెలుగు: ‘నీకు ఇది జీవితంలో గుర్తుడిపోయే బర్త్డే. ఈ గజమాల, ఈ కిరీటం.. నీ గెటప్బాగుంది. కానీ, ఈ అర్ధరాత్రి పూట. .రోడ్డు మధ్యలో బండి అడ్డం పెట్టి బర్త్డే పార్టీలు చేసుకోవడం కరెక్ట్ కాదు..రోడ్డును బ్లాక్ చేసేందుకు పర్మిషన్ ఎక్కడిది ఇది నేరం. మీ అందరిపై చర్యలు తీసుకుంటాం.. వీళ్లపై కేసులు నమోదు చేయండి’ అంటూ ఉప్పల్సీఐ ఎలక్షన్రెడ్డి.. బర్త్ డే చేసుకుంటున్న యువకుడు, అతడి స్నేహితులను సుతిమెత్తగా మందలించారు. అందరికీ కౌన్సెలింగ్కూడా ఇచ్చారు.
ఆదివారం రాత్రి ఉప్పల్భగాయత్లోని డీ మార్ట్ పక్కన అందులో పని చేసే 8 మంది యువకులు బర్త్డే చేసుకున్నారు. ఓ యువకుడి మెడలో గజమాల వేసి, కిరీటం పెట్టి.. రోడ్డు మధ్యలో బండి అడ్డంగా పెట్టి దానిపై కేక్పెట్టి సెలబ్రేషన్స్జరుపుకున్నారు.
వాహనదారుల సమాచారంతో సీఐ ఎలక్షన్ రెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. కేక్ కట్ చేస్తున్న డీమార్ట్ సిబ్బంది దగ్గరకు వెళ్లి క్లాస్పీకారు. చివరకు వారంతా తమను క్షమించాలని, తప్పయ్యిందని సారీ చెప్పారు. ‘మీకు ఎగ్జెంప్షన్ఇస్తే అందరూ ఇలాగే అడుగుతారు’ అంటూ వారిపై కేసు నమోదు చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇటీవల కాలంలో చాలామంది యువకులు అర్ధరాత్రి పూట బర్త్డే వేడుకల పేరుతో హంగామా చేస్తూ డిస్ట్రబ్చేస్తున్నారని, అలాంటి వారికి ఈమాత్రం కౌన్సెలింగ్పడాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.