టేక్మాల్​లో యువకుడు అదృశ్యం

టేక్మాల్​లో యువకుడు అదృశ్యం

టేక్మాల్, వెలుగు: యువకుడు అదృశ్యమైన సంఘటన టేక్మాల్​లో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామనికి చెందిన ఫొటో గ్రాఫర్​బాజ గణేశ్​ (28) ఈ నెల 2న ఫొటోలు తీయడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి రావడానికి మూడు, నాలుగు రోజులు పడుతుందన్నాడు. నాలుగు రోజులైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గణేశ్ సెల్​కు ఫోన్​ చేస్తే స్విచ్​ఆఫ్​వస్తోంది. స్నేహితులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆదివారం గణేశ్​తండ్రి కిష్టయ్య టేక్మాల్​ పీఎస్​లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మురళీ తెలిపారు.