పంజాగుట్ట, వెలుగు: లోన్ యాప్స్ వేధింపు లకు మరో యువకుడు బలయ్యాడు. హైదరా బాద్లోని బోరబండ బ్రహ్మ శంకర్ నగ ర్కు చెందిన విజయ్ కుమార్ (22) శంషాబాద్ ఎయిర్ పోర్టులో సరుకు రవాణా విభాగంలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఆర్థిక అవసరాల కోసం పలు లోన్ యాప్స్ నుంచి సుమారు రూ.లక్ష వరకు రుణం తీసుకున్నాడు. గడువులోగా డబ్బులు చెల్లించకపోవడంతో లోన్ యాప్స్ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి.
విజయ్ కుమార్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అతనికే పంపించి, బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. లోన్ క్లియర్ చేయకపోతే వాటిని అతని ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్న బంధువులు, ఫ్రెండ్స్ కు పంపుతామంటూ బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన విజయ్ కుమార్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు విజయ్ను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.