తాగి కారు నడిపి..ప్రజాభవన్ బారికేడ్లను ఢీకొట్టిండు

తాగి కారు నడిపి..ప్రజాభవన్ బారికేడ్లను ఢీకొట్టిండు
  •     యువకుడిని అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు

పంజాగుట్ట, వెలుగు :  తాగిన మత్తులో కారు నడిపిన ఓ యువకుడు ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టాడు. ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది.  ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.45 గంటలకు ఓవర్ స్పీడ్ తో వచ్చిన ఓ కారు ప్రజా భవన్ వద్ద ఉన్న బారికేడ్లను ఢీకొట్టింది. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నాగేశ్వరరావు వెంటనే ఏఎస్సైకి సమాచారం ఇచ్చాడు. మద్యం మత్తులో కారు నడిపిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

అయితే, ఆ యువకుడు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడని సమాచారం. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగానే అతడు తప్పించుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్​ కుమార్ పంజాగుట్ట స్టేషన్​కు వచ్చి వివరాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.