పెళ్లై పిల్లలున్న వ్యక్తిని ప్రేమించిన యువతి

పెళ్లై పిల్లలున్న వ్యక్తిని ప్రేమించిన యువతి
  •     పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం
  •     యువతి మృతి, యువకుడి పరిస్థితి విషయం

ఆదిలాబాద్‌‌ టౌన్‌‌, వెలుగు : పెళ్లి అయి ఇద్దరు పిల్లలున్న వ్యక్తి, ఓ యువతి ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ పురుగుల మందు తాగారు. యువతి చనిపోగా, అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆదిలాబాద్‌‌ రూరల్‌‌ మండలం పిప్పల్‌‌దరి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన భుజంగరావుకు ఇదివరకే పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

ఇతడు అదే గ్రామానికి చెందిన కవిత (19) ప్రేమించుకుంటున్నారు. వీరి విషయంలో ఇంట్లో తెలియడంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన వారు శనివారం పురుగుల మందు తాగారు. గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 108 రిమ్స్‌‌కు తరలించగా అప్పటికే యువతి చనిపోయిందని, భుజంగరావు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్​సీఐ ఫణిధర్‌‌ తెలిపారు.