
గోదావరిఖని, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన ఎండీ అబ్దుల్అబీద్హజ్యాత్రకు నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 12న ఇంటి నుంచి బయలుదేరిన అబీద్ఆదివారం గోదావరిఖనికి చేరుకున్నాడు. ఆయనకు స్థానిక జామా మజీద్ మత పెద్దలు ఫసీయోద్దీన్, సర్వర్ హుస్సేన్, ఎండీ ఖాజామియా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్ల వరకు కాలినడకన వెళ్తానని, దగ్గరలో ఉండే మజీద్లో విశ్రాంతి తీసుకుంటున్నానని అబీద్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా బార్డర్ నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అయి గుజరాత్, పంజాబ్ మీదుగా పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలోని హజ్కు 10 నెలల పాటు 5 వేల కిలోమీటర్లు ప్రయాణించి చేరుకుంటానని చెప్పాడు.