
హైదరాబాద్, వెలుగు: సబ్ జూనియర్ నేషనల్ రోయింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ రోయర్లు సత్తా చాటారు. కాశబోయిన అభిజిత్, గడ్డం వివేక్ జోడీ ఫైనల్స్కు దూసుకెళ్లింది. హుస్సేన్సాగర్ లేక్లో శుక్రవారం జరిగిన సబ్ జూనియర్ బాయ్స్ డబుల్ స్కల్ సెమీ ఫైనల్లో అభిజిత్, వివేక్ జోడీ అద్భుతమైన సమన్వయంతో 1 నిమిషం 37.8 సెకన్ల టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచింది.
సబ్ జూనియర్ బాయ్స్ సింగిల్ స్కల్ సెమీఫైనల్లో తెలంగాణకు చెందిన బానావత్ జస్వంత్ 1 నిమిషం 49.0 సెకన్ల టైమింగ్తో మూడో స్థానంలో నిలిచాడు. ఫైనల్ బెర్త్ కోసం అతను గట్టిగానే పోరాడినప్పటికీ, స్వల్ప తేడాతో అవకాశం చేజారింది. యంగ్ జూనియర్ బాయ్స్ డబుల్ స్కల్ సెమీఫైనల్ 1లో స్టేట్ సంధుల శివరాం– తల్వార్ ఉపేంద్ర ద్వయం 1 నిమిషం 46.5 సెకన్ల టైమింగ్తో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.