
నిజామాబాద్, వెలుగు: ఏటీఎంలో పెట్టాల్సిన రూ.40.50 లక్షల నగదుతో ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగి రమాకాంత్ శనివారం (june 14) ఉడాయించాడు. నిజామాబాద్ జిల్లాలోని ఏటీఎంలలో నగదు పెట్టే హిటాచీ క్యాష్ ఏజెన్సీకి హైదరాబాద్ నుంచి డబ్బు రాగా.. ఆర్మూర్, నిజామాబాద్ ఏరియాలకు వెహికల్స్లో క్యాష్ పంపించారు.
బోధన్ ఏరియాకు నగదు చేరవేయాల్సిన బాధ్యత రమాకాంత్ది కాగా, ఎల్లమ్మగుట్టలోని ఆఫీస్లో ఎవరూ లేని విషయం తెలుసుకొని, నగదు బ్యాగ్ను బైక్పై పెట్టుకొని పత్తాలేకుండా పోయాడు. ఈ ఘటనపై నాల్గవటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.