రూ.40.50 లక్షల ఏటీఎం క్యాష్తో పరార్

రూ.40.50 లక్షల ఏటీఎం క్యాష్తో పరార్

నిజామాబాద్, వెలుగు: ఏటీఎంలో పెట్టాల్సిన రూ.40.50 లక్షల నగదుతో ప్రైవేట్​ ఏజెన్సీ ఉద్యోగి రమాకాంత్​ శనివారం (june 14) ఉడాయించాడు. నిజామాబాద్​ జిల్లాలోని ఏటీఎంలలో నగదు పెట్టే హిటాచీ క్యాష్​ ఏజెన్సీకి హైదరాబాద్​ నుంచి డబ్బు రాగా.. ఆర్మూర్, నిజామాబాద్​ ఏరియాలకు వెహికల్స్​లో క్యాష్​ పంపించారు.

 బోధన్​ ఏరియాకు నగదు చేరవేయాల్సిన బాధ్యత రమాకాంత్​ది కాగా, ఎల్లమ్మగుట్టలోని ఆఫీస్​లో ఎవరూ లేని విషయం తెలుసుకొని, నగదు బ్యాగ్​ను బైక్​పై పెట్టుకొని పత్తాలేకుండా పోయాడు. ఈ ఘటనపై నాల్గవ​టౌన్​ పోలీసులు కేసు నమోదు చేశారు.