పుస్తకాలు పంపిణీ చేసి, మౌలిక వసతులు కల్పించాలె

పుస్తకాలు పంపిణీ చేసి, మౌలిక వసతులు కల్పించాలె

సర్కారు స్కూళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ABVP ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా DEO ఆఫీస్ ల ముట్టడికి పిలుపునిచ్చారు. బషీర్ బాగ్ వద్ద హైదరాబాద్ DEO ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన ABVP కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.. అరెస్టు చేశారు. ఎండాకాలం సెలవుల తర్వాత మళ్లీ ఇటీవలే స్కూళ్లు తెరుచుకున్న విషయం తెలిసిందే. అయితే స్కూళ్లు ప్రారంభమై దాదాపు 20 రోజులైనా ఇంకా పుస్తకాల పంపిణీ మొదలు కాకపోవడం దారుణమని ఏబీవీపీ కార్యకర్తలు ఆరోపించారు. మన ఊరు -మన బడి కేవలం ప్రకటనకే పరిమితమైందని... పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు అధిక ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ లేదన్న కార్యకర్తలు.. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని కోరారు. సర్కారు పాఠశాలల్లో సత్వరమే బుక్స్ పంపిణీ చేసి, మౌలిక వసతులు కల్పించాలని ABVP నాయకులు డిమాండ్ చేశారు.