ఏసీబీకి చిక్కిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీ

ఏసీబీకి చిక్కిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీ

రాజేంద్రనగర్, వెలుగు: జిల్లాలోని పుప్పాలగూడ  పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీ సభ్యులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక భవన నిర్మాణ అనుమతుల కోసం ఎంపీటీసీ శివప్రసాద్, పంచాయతీ కార్యదర్శి శివయ్య ఓ వ్యక్తి దగ్గర లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని ప్రాధేయ పడినా వినకపోవడంతో రూ.2లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అదే సమయంలోఅవినీతి నిరోధక శాఖ అధికారులనూ ఆశ్రయిం-చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు  పథకం ప్రకారం… వారు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టు కున్నారు. వీరిద్దరితో పాటు గా దీనితో సంబంధం ఉన్న మరో కార్యదర్శిని కూడా అదుపులోకి తీసుకున్నారు.