లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీహెచ్ ఎంసీ ఏఈ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీహెచ్ ఎంసీ ఏఈ
  • అంబర్‌‌పేట లోని బల్దియా ఆఫీసులో ఏసీబీ రైడ్స్

అంబర్ పేట, వెలుగు:  హైదరాబాద్ లోని  అంబర్‌‌పేట జీహెచ్‌ఎంసీ సర్కిల్ గోల్నాక లోని నెహ్రూ నగర్‌ వార్డ్ నంబర్ .-2లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ మనీషా లంచం తీసుకుంటూ ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డారు.  కాంట్రాక్టర్ బిల్లులు పాస్ చేయడానికి ఏఈ మనీషా  రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు. 

దీంతో బాధితుడు మొదట రూ. 5 వేలు ఇవ్వగా ఆమె తీసుకుంది. ఆ తర్వాత బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.  సోమవారం ప్లాన్ ప్రకారం..  ఏఈ మనీషా రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ పట్టుకుని నగదు స్వాధీనం చేసుకుంది. విచారణ కోసం ఆమెను ఏసీబీ ఆఫీసుకు తరలించారు.