
- అంబర్పేట లోని బల్దియా ఆఫీసులో ఏసీబీ రైడ్స్
అంబర్ పేట, వెలుగు: హైదరాబాద్ లోని అంబర్పేట జీహెచ్ఎంసీ సర్కిల్ గోల్నాక లోని నెహ్రూ నగర్ వార్డ్ నంబర్ .-2లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ మనీషా లంచం తీసుకుంటూ ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డారు. కాంట్రాక్టర్ బిల్లులు పాస్ చేయడానికి ఏఈ మనీషా రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు మొదట రూ. 5 వేలు ఇవ్వగా ఆమె తీసుకుంది. ఆ తర్వాత బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం ప్లాన్ ప్రకారం.. ఏఈ మనీషా రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ పట్టుకుని నగదు స్వాధీనం చేసుకుంది. విచారణ కోసం ఆమెను ఏసీబీ ఆఫీసుకు తరలించారు.