కామారెడ్డిలో ఏసీబీ వలకు అవినీతి అధికారి

కామారెడ్డిలో ఏసీబీ వలకు అవినీతి అధికారి

కామారెడ్డి జిల్లాలో లంచం తీసుకుంటున్న పంచాయితీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన భూదేవి అనే మహిళ నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. భర్త చనిపోవడంతో వితంతు ఫించన్ తో పాటు ఇంటి నిర్మాణం అనుమతి కోసం పంచాయితీ కార్యదర్శిని దరఖాస్తు కోరింది శ్రీదేవి. దీంతో పంచాయితీ కార్యదర్శి రూ.20 వేల లంచాన్ని డిమాండ్ చేశాడు. అయితే శ్రీదేవి తండ్రి రాజయ్య 7 వేల రూపాయలను ఇస్తానని ఒప్పించాడు. తర్వాత రాజయ్య ACB అధికారులను ఆశ్రయించాడు. దీంతో పంచాయితీ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

మరిన్ని వార్తల కోసం

కృష్ణ నీటిపై సర్కారు తీరుతో రాష్ట్రానికి నష్టం

రైల్వే ట్రాక్ లే వారి నివాసాలు