తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. కొండను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. కొండను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

తిరుమల: తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు కొండను ఢీకొంది. ఈ ప్రమాదంలో భక్తులకు స్వల్ప గాయాలయ్యాయని టీటీడీ అధికారులు తెలిపారు.  గాయపడ్డ భక్తులను 108 వాహనంలో తిరుమల అశ్వని ఆసుపత్రికి తరలించారు. తిరుపతి నుండి తిరుమలకు వెలుతుండగా ప్రమాదం జరిగింది. తిరుమలకు 4 కిలోమీటర్ల దగ్గర బస్సు ప్రమాదానికి గురైంది.  ఈ ప్రమాదంతో ఘాట్ లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.  ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.