నిద్రలో పోలీసులు..కస్టడి నుంచి నిందితుడు పరార్

నిద్రలో పోలీసులు..కస్టడి నుంచి నిందితుడు పరార్

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ నుండి పోలీసు కస్టడీ నుండి నిందితుడు పరారయ్యాడు.గతంలో ఎడపల్లి మండలంలోని  మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన ఘటననలో  కోర్టులో లొంగిపోయాడు  సిద్దాపూర్ గ్రామానికి కు చెందిన పిరాజి. విచారణ నిమిత్తం పోలీసు కస్టడీలోకి ఒక రోజు ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరగా ఒక రోజు అనుమతి ఇఛ్చింది కోర్టు. పోలీస్ స్టేషన్ లో పోలీసులు నిద్రిస్తున్న సమయంలో నిందితుడు పారిపోయాడు . అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై ఎడపల్లి యస్.ఐ ఎల్లయ్య గౌడ్  ఉన్నత అధికారులకు సమాచారం అందించగా ఎడపల్లి పోలీస్ స్టేషన్ ను ఏసీపీ రామారావు సందర్శించి ఉన్నత అధికారులకు నివేదిక సమర్పించారు.