మెట్ పల్లి, వెలుగు: తనకు విడాకులిచ్చి వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన మాజీ భర్తపై ఓ మహిళ యాసిడ్దాడి చేసింది. ఎస్సై అనిల్ వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఏర్ధండి గ్రామానికి చెందిన నీరటి మహేశ్(36) ఎనిమిదేండ్ల కింద మెట్పల్లి మండలం జగ్గసాగర్కు చెందిన మాస లక్షణను పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఓ పాప ఉంది. పెండ్లయినప్పటి నుంచి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఇరుకుటుంబాలు పలుమార్లు పంచాయితీ నిర్వహించి సర్ది చెప్పారు. అయినా మారకపోవడంతో 5 నెలల కింద పరస్పర అంగీకారంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. దీంతో మహేశ్ మళ్లీ పెండ్లి చేసుకునేందుకు మంగళవారం ముహూర్తం నిశ్చయించుకున్నాడు. విషయం తెలుసుకున్న మాస లక్షణ మంగళవారం కోపంతో మహేశ్ ఇంటికి వెళ్లింది. అతను బయటకు రాగానే బాటిల్లో తెచ్చుకున్న యాసిడ్తో దాడిచేసింది. అతని వీపు, ఎడమ కన్ను భాగంలో గాయాలయ్యాయి. దీంతో మహేశ్ను కుటుంబసభ్యులు వెంటనే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మాస లక్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మాజీ భర్తపై మహిళ యాసిడ్ దాడి
- తెలంగాణం
- March 20, 2024
లేటెస్ట్
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- వచ్చేసిందమ్మ.. విక్టోరియా షి: ఇజ్రాయిల్ AI కాన్సులేట్ ప్రతినిధి
- కోవీషీల్డ్ ఎఫెక్ట్ : కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో తొలగింపు
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- Allu Arjun, David Warner: చాలా ఈజీ.. కలిసినప్పుడు నేర్పిస్తా.. డేవిడ్ వార్నర్కు అల్లు అర్జున్ మెసేజ్
- శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించిన కేఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం
- ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బతికే ఉన్నాడు : అమెరికా పోలీసులు
- T20 World Cup 2024: వరల్డ్ కప్ జట్టు ఇదేనా..? ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్ పాకిస్థాన్ స్క్వాడ్ ప్రకటన
- మే 10న చార్ ధామ్ యాత్ర ప్రారంభం... రోజుకు 16 వేల మందికి దర్శనం..
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు