మాజీ భర్తపై మహిళ యాసిడ్ దాడి

మాజీ భర్తపై మహిళ యాసిడ్ దాడి

మెట్ పల్లి, వెలుగు: తనకు విడాకులిచ్చి వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన మాజీ భర్తపై ఓ మహిళ యాసిడ్​దాడి చేసింది. ఎస్సై అనిల్​ వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఏర్ధండి గ్రామానికి చెందిన నీరటి మహేశ్‌‌(36) ఎనిమిదేండ్ల కింద మెట్‌‌పల్లి మండలం జగ్గసాగర్‌‌‌‌కు చెందిన మాస లక్షణను పెండ్లి చేసుకున్నాడు.  వీరికి ఓ పాప ఉంది. పెండ్లయినప్పటి నుంచి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఇరుకుటుంబాలు పలుమార్లు పంచాయితీ నిర్వహించి సర్ది చెప్పారు. అయినా మారకపోవడంతో 5 నెలల కింద పరస్పర అంగీకారంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. దీంతో మహేశ్‌‌ మళ్లీ పెండ్లి చేసుకునేందుకు మంగళవారం ముహూర్తం నిశ్చయించుకున్నాడు. విషయం తెలుసుకున్న మాస లక్షణ మంగళవారం కోపంతో మహేశ్‌‌ ఇంటికి వెళ్లింది. అతను బయటకు రాగానే బాటిల్‌‌లో తెచ్చుకున్న యాసిడ్‌‌తో దాడిచేసింది. అతని వీపు, ఎడమ కన్ను భాగంలో గాయాలయ్యాయి.  దీంతో మహేశ్‌‌ను కుటుంబసభ్యులు వెంటనే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మాస లక్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.