అటవీ భూమి దత్తత తీసుకున్న నాగార్జున దంపతులు

అటవీ భూమి దత్తత తీసుకున్న నాగార్జున దంపతులు

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. మేడ్చల్ జిల్లాలో దాదాపు 1000 ఎకరాల అటవీ భూమిని ఆయన దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అర్బన్ పార్కుకు శంకుస్థాపన చేశారు. బిగ్ బాస్ సీజన్ 5 లో.. ఓ ఎపిసోడ్ లో నాగార్జున 1000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటానని ఎంపి సంతోష్ కుమార్ కు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఇవాళ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తన భార్య అమల, మంత్రి మ‌ల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ తో క‌లిసి మేడ్చల్ జిల్లా చెంగిచెర్లకు వెళ్లారు. అక్కడ 1000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను నాగార్జున దత్తత తీసుకున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నాగార్జున అడవిని దత్తత తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ కార్యక్రమంలో నాగార్జున ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ లు కూడా భాగస్వాములయ్యారు. వీరంతా కలిసి ఆ ప్రాంతంలో మొక్కలను నాటారు.

ఇవి కూడా చదవండి:

లీక్ చేస్తే కఠిన చర్యలు

‘సరిగమప’లో పూజా హెగ్డే