పాలమూరు కథలో పవన్ కళ్యాణ్!

పాలమూరు కథలో పవన్ కళ్యాణ్!

హిందీ రీమేక్ ‘వకీల్ సాబ్’తో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని కంటే ఆయన తర్వాతి మూవీపైనే అందరి దృష్టీ ఉందేమో అనిపిస్తోంది. ఎందుకంటే క్రిష్ డైరెక్షన్‌‌లో ఆయన చేస్తున్న సినిమా గురించిన చర్చే ప్రతి చోటా నడుస్తోంది. ఈ మూవీని హిందీలో కూడా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. హిందీలో ‘మణికర్ణిక’ను తెరకెక్కించి కంగనతో పడకపోవడంతో ఆప్రాజెక్ట్ నుండి తప్పుకున్న క్రిష్.. పవన్
సినిమాతో హిందీలోనూ తనమార్క్ చూపించాలని భావిస్తున్నాడట. ఇందులో భాగంగా పవన్ మూవీకోసం బాలీవుడ్ హీరోయిన్ని తీసుకోవడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో పూజాహెగ్డే, కియారా అద్వానీ, వాణీ కపూర్, దిశాపటాని పేర్లు వినిపించగా.. తాజాగా శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు తెరపైకొచ్చింది. కిక్, రేస్ 3 లాంటి చిత్రాల్లో నటించిన జాక్వెలిన్ కి తెలుగు సినిమా కొత్తేమీ కాదు. ‘సాహో’లో ప్రభాస్ సరసన ఒక పాటలో మెరిసింది. అయితే పవన్ సినిమాలోమాత్రం పూర్తిస్థాయి హీరోయిన్ గా కనిపించనుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉండే ఈ సినిమాలో మరొకరిని కూడా బాలీవుడ్ వారినే తీసుకునే ఆలోచన ఉందట. పాలమూరుకు చెందిన పండగ సాయన్న జీవితం ఆధారంగా ఈ సినిమా ఉండనుందని, ‘విరూపాక్షి’ అనే టైటిల్ కూడా నిర్ణయించినట్టు ప్రచారంలో ఉంది. 150 ఏళ్ల క్రితం సామాన్యుల కోసం సాయుధ దళంతో ఆధిపత్య వర్గాలపై సాయన్న పోరాటం చేశాడు. అతన్ని బందిపోటుగా ముద్ర వేసి చంపేశారట. ఆ పాత్రను ఇప్పుడు పీకే పోషించనున్నాడు. మన నేటివిటీతో ఉండే ఈ పాలమూరు కథలో జాక్వెలిన్ లాంటి గ్లామర్ హీరోయిన్ కి ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారోననే ఆసక్తి నెలకొంది. ఏదైతేనేం.. హిందీలో అవకాశాలు తగ్గిన జాక్వెలిన్ కి ఈ సినిమా పుణ్యమా అని పవన్ లాంటి క్రేజీ స్టార్ సరసన నటించే అవకాశం దక్కుతోంది.

For More News..

ఇంటర్ విద్యార్థులకు కూడా పరీక్షలు లేకుండానే ప్రమోట్

ఫోన్ చేస్తే ఫ్రీగా ఫుడ్

ఇయ్యాల్టి నుంచే రేషన్ పంపిణీ