
వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపును అందుకున్న ప్రియదర్శి.. జాతిరత్నాలు, మల్లేశం, బలగం లాంటి చిత్రాలతో హీరోగానూ మెప్పించాడు. ఈ క్రమంలో అతను హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ బ్యానర్లో ఇంద్రగంటికి ఇది మూడో చిత్రం. గతంలో ఇదే సంస్థలో నాని హీరోగా ‘జెంటిల్మన్’, సుధీర్ బాబు హీరోగా ‘సమ్మోహనం’ చిత్రాలు చేశారు. మార్చి నెలాఖరు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.