
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్-3 ఈ నెల 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ కు మంచి టాక్ రాగా.. ఇవాళ ప్రీరిజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. 45 ఏళ్ల కెరీర్ లో తాను నవ్వించే పాత్రలు చేస్తూ సక్సెస్ అయ్యానన్నాడు. అన్ని సమస్యలకు ఒక్క నవ్వుతోనే పరిష్కారం అవుతాయని.. అలాంటి కామెడీ సీన్స్ ఎఫ్ -3లో ఎన్నో ఉన్నాయని తెలిపాడు. డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడన్న రాజేంద్రప్రసాద్.. విక్టరీ వెంకటేష్ నటన సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చెప్పాడు.
మనిషికి జీవితంలో ఏంకావాలో ఈ మూవీ ద్వారా ప్రేక్షకుడికి మంచి మెసేజ్ వెళ్తుందని.. వరుణ్ తేజ్ నుంచి ప్రదీప్ వరకు ప్రతీ క్యారెక్టర్ అదుర్స్.. హ్యాట్సాప్ అనిల్ రావిపూడి అన్నాడు. బోలెడన్నీ క్యారెక్టర్లు ఈ సినిమాలో ఉన్నాయని ఎఫ్-3లో నటించేటప్పుడు అహానా పెళ్లంట సినిమా నాకు గుర్తు చేసిందని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. గుండెమీద చేయివేసుకుని చెబుతున్నానని ఎఫ్-3 సూపర్ హిట్ కాకుంటే మళ్లీ మీ ముందు నిలబడను అని సినిమాపై ధీమాను తెలిపాడు రాజేంద్రప్రసాద్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో సునీల్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ కీలకపాత్రల్లో నటించగా దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్.
మరిన్ని వార్తల కోసం...