ఇంట్లో దాచిన రూ. 4 లక్షలతో చిన్నారుల జల్సాలు..!

ఇంట్లో దాచిన రూ. 4 లక్షలతో  చిన్నారుల జల్సాలు..!

హైదరాబాద్: తల్లిదండ్రులు బీరువాలో దాచిన నాలుగు లక్షల రూపాయలను ఇద్దరు 9, 8 ఏళ్ల వయసున్న చిన్నారులు(సోదరులు) 20 రోజుల్లోనే ఖర్చు చేశారు. ఈఘటన జీడిమెట్ల PS పరిధిలోని ఎస్ఆర్ నాయక్ కాలనీలో జరిగింది. నెల కిందట 4 లక్షల రూపాయలను దంపతులు ఇంట్లో తెచ్చిపెట్టారు. ఇది గమనించిన ఇద్దరు మైనర్లు .. సమీపంలోని స్నేహితులకు చెప్పారు. ఇంట్లో డబ్బులను కొంచెం కొంచెం తీసుకొచ్చేలా వారిని తోటి స్నేహితులు ప్రోత్సహించారు. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో నుంచి రోజూ కొంత డబ్బు తీసుకొని స్నేహితులతో జల్సాలకు మరిగారు. స్మార్ట్ వాచ్ లు..స్మార్ట్ ఫోన్లు కొన్నారు. గేమింగ్ సెంటర్, రెస్టారెంట్లకు వెళ్లారు. తీసిన డబ్బు స్థానంలో నకిలీ నోట్లు పెట్టారు. 20 రోజుల తర్వాత బీరువాలో డబ్బులను పరిశీలించిన తల్లిదండ్రులు కంగుతున్నారు. డబ్బులు మొత్తం తగ్గాయి..పైగా నకిలీ నోట్లు ఉన్నాయని నోరెళ్లబెట్టారు. ఇద్దరుకుమారులను నిలదీయగా అసలు విషయం చెప్పారు. ఘటనపై జీడిమెట్ల  పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చిన్నారులకు నకిలీ డబ్బులు ఎలా వచ్చాయి. ఎవరుప్రోత్సహించారు అనేదానిపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం :-

నాటో తూర్పుకొస్తే.. మిలటరీ దింపుతం


సౌత్​ కొరియాలో బైడెన్​ టూర్