సౌత్​ కొరియాలో బైడెన్​ టూర్

సౌత్​ కొరియాలో బైడెన్​ టూర్

ప్యోంగ్ టేక్(సౌత్​  కొరియా): అంతర్జాతీయ అంశాలు, టెక్నాలజీ ఇష్యూలే ఎజెండాగా అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్​ ఆసియా టూర్​ ప్రారంభించారు. ముఖ్యంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను ఇబ్బందులకు గురిచేస్తున్న కంప్యూటర్​ చిప్ షార్టేజ్​ అంశంపై ఆయన ప్రధానంగా  దృష్టి సారించారు. శుక్రవారం సౌత్ కొరియా చేరుకున్న బైడెన్​ అక్కడ శాంసంగ్​కు చెందిన కంప్యూటర్​ చిప్​ తయారీ యూనిట్​ను సందర్శించారు. ఇదే తరహాలో 17 బిలియన్ అమెరికన్ డాలర్లతో శాంసంగ్​ అమెరికాలోని టెక్సాస్​లో చిప్ తయారీ ప్లాంట్​ను నెలకొల్పనుంది. అమెరికాలో పెట్టే చిప్​ ప్లాంట్​ ద్వారా 3 వేల ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఫ్యాక్టరీ నిర్మాణంలో వేలాది మంది  కార్మికులకు పని దొరుకుతుందనే అమెరికన్ల అభిప్రాయం. గత ఏడాది సెమీ కండక్టర్ల షార్టేజీ కారణంగా అంతర్జాతీయంగా ఆటో ఇండస్ట్రీ, కిచెన్​ అప్లయన్సెస్, ఇతర కంపెనీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి.. కొంత కాలంగా అమెరికా ఓటర్లలో బైడెన్​ పబ్లిక్ అప్రూవల్​ రేటు తగ్గిపోతూ వచ్చింది. సౌత్​ కొరియా, జపాన్​లో బైడెన్​ ఐదు రోజుల టూర్​లో భాగంగా విదేశాంగ విధానానికి సంబంధించి అనేక పాలసీలపై చర్చలు జరపనున్నారు. సౌత్​ కొరియా కొత్త అధ్యక్షుడు యాన్​ సుక్​ యోల్​, శాంసంగ్​ ఎలక్ట్రానిక్స్​ వైస్​ చైర్మన్ లీ జియాంగ్​తో బైడెన్​ సమావేశమయ్యారు.