ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధం నెలలు దాటిపోతోంది. మొత్తం ఆక్రమించుకోవాలని రష్యా ప్రయత్నాలను ఉక్రెయిన్ సైన్యం అడ్డుకొంటోంది. అయితే.. కొన్ని నగరాల్లో మాత్రం రష్యా సైనికులు పట్టు సాధిస్తున్నారు. కీలక నగరాలను స్వాధీనం చేసుకొనేందుకు రష్యా బలగాలు భీకర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో.. రష్యా కీలక ప్రకటన చేసింది. మరియుపోల్లో కొన్ని నెలలపాటు సాగిన యుద్ధం ముగిసినట్లు రష్యా ప్రకటించింది. మరియుపోల్లోని అజోవ్ స్టీల్ ప్లాంట్ కూడా విముక్తి అయినట్లు తెలిపింది. అజోవ్ ప్లాంట్కు రక్షణగా ఉన్న సైనికులు పూర్తిగా లొంగిపోయినట్లు, ప్లాంట్లో పూర్తి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చినట్లు రష్యా దళాలు ప్రకటించాయి.
స్టీల్ ప్లాంట్ ఆక్రమణతో శుక్రవారం 531 మంది ఉన్న ఉక్రెయిన్ సైనికుల చివరి గ్రూప్ లొంగిపోయినట్లు రష్యా సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఇగర్ కొనషెంకోవ్ తెలిపారు. అంతకు ముందు 2 వేల 400 మంది ఉక్రెయిన్ పౌరులు, సైనికులను రష్యా సైన్యం తమ అదుపులోకి తీసుకుందని సమాచారం. రష్యా బలగాల దాడులతో అజోవ్ ప్లాంట్లో కొన్ని నెలల పాటు ఉక్రెయిన్ సైన్యం తలదాచుకుంది. మరోవైపు ఉక్రెయిన్పై దాడులతో రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ పై దాడుల్లో రష్యాకు సహకారం అందించిన బెలారస్ పై సెర్బియా ఆంక్షలు విధించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, రష్యాకు చెందిన ప్రముఖులపై కెనడా బ్యాన్ విధించింది.
మరిన్ని వార్తల కోసం :-
నాటో తూర్పుకొస్తే.. మిలటరీ దింపుతం
సౌత్ కొరియాలో బైడెన్ టూర్