బాలీవుడ్లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆయన ముంబైలోని గోరేగావ్లోని తన ఇంట్లో సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే ఆయన చనిపోయే ముందు తన ఫేస్బుక్ పేజీలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. తనకు, తన భార్యకు విభేదాలున్నాయని.. అందువల్లే చనిపోతున్నానని పేర్కొన్నాడు. కాగా.. తన మరణానికి, తన భార్య కారణం కాదని కూడా తెలిపాడు. సోమవారం రాత్రి ఆయన తన గదిలో అపస్మారకస్థితిలో ఉండటాన్ని గమనించిన సందీప్ భార్య కాంచన్ మరియు ఆమె స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి.. ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సందీప్ చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు.
సందీప్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన ఎంఎస్.ధోని, అక్షయ్ కుమార్ నటించిన కేసరి వంటి చిత్రాల్లో నటించాడు. సందీప్ మృతితో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాలీవుడ్ నటులు వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోవడాన్ని చిత్రపరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. గోరేగావ్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
For More News..