చావుతో గేమ్సా : పూనం పాండే బతికే ఉంది.. చచ్చిపోలేదు

 చావుతో గేమ్సా : పూనం పాండే బతికే ఉంది.. చచ్చిపోలేదు

 వివాదాస్పద నటి పూనం పాండే బతికే ఉంది.. చచ్చిపోలేదు.. అంతా నాటకం అంటూ వీడియో రిలీజ్ చేసింది. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కోసం చావు డ్రామా ఆడినట్లు స్పష్టం చేసింది. గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్లు ఫిబ్రవరి 2వ తేదీ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్టు వచ్చింది. అఫిషియల్ అనౌన్స్ మెంట్ అని అందరూ భావించి.. పూనం పాండే చనిపోయిట్లు వార్తలు రాశారు.. 24 గంటల తర్వాత బతికే ఉన్నానని.. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ పై ప్రచారం కోసం ఇలా చేసినట్లు వెల్లడించింది.

బతికే ఉన్నట్లు వీడియో రిలీజ్ చేయటమే కాకుండా.. సర్వైకల్ క్యాన్సర్ ద్వారా తాను చనిపోక పోయినా.. ఈ వ్యాధికి చాలా మంది చనిపోతున్నారని.. ఈ క్యాన్సర్ పై అవగాహన కోసం ఇలాంటి ప్రచారాన్ని ఉపయోగించుకున్నట్లు స్పష్టం చేసింది పూనం పాండే. నేను బతికే ఉన్నాను.. సజీవంగా ఉన్నాను.. ఇప్పటి వరకు ఈ క్యాన్సర్ నన్ను చంపలేదు.. కాకపోతే వేలాది మందిని ఈ క్యాన్సర్ చంపుతుంది.. వారికి కనీస అవగాహన ఉండటం లేదు.. దీని కోసమే ఇలా చావు నాటకం ఆడినట్లు వెల్లడించింది పూనం పాండే.

అయితే పూనం పాండే డెత్ డ్రామా పై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా మంచిని చెప్పాలంటే మంచిగానే చెప్పాలి కానీ ఇలా ప్రజల ఎమోషన్స్ తో ఆడుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు క్యాన్సర్ గురించి అవగాహన తెలపడం కోసం పూనం మంచి పనే చేసిందని ఎందుకంటే ప్రజలకు మనిషి బతికుండి చెప్పుంటే ఇంతలా రీచ్ అయ్యేది కాదని కామెంట్ చేస్తున్నారు.