జయలలిత సమాధి వద్ద కంగనా రనౌత్ నివాళులు

జయలలిత సమాధి వద్ద కంగనా రనౌత్ నివాళులు

చెన్నై: దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నివాళులర్పించారు. జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ‘తలైవి’ సినిమాలో కంగనా.. జయలలిత పాత్రలో నటించారు. తమిళనాడు ఎన్నికలే కాదు దేశ వ్యాప్తంగా జయలలిత ప్రభావం ఎలా ఉందనేది ఈ సినిమాలో తెరకెక్కించినట్లు రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఎట్టకేలకు సినిమా హాళ్లు తెరచుకుంటుండడంతో ఈనెల 10వ తేదీన సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. 

ఈ నేపధ్యంలో సినిమాలో తన పాత్రకు ఆధారమైన మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద కొద్దిసేపు మౌనం పాటించి కంగనా రనౌత్ నివాళులర్పించారు. అనంతరం దివంగత ఎంజీఆర్ సమాధి వద్ద కూడా ఆమె నివాళులర్పించారు. తలైవి సినిమా ప్రమోషన్ మొదలుపెట్టనున్న నేపధ్యంలో నివాళులర్పించిన అనంతరం ప్రచార కార్యక్రమాలకు కంగనా రనౌత్ శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.