సీక్రెట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. నెల తర్వాత ఫోటోలు పోస్ట్..

సీక్రెట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. నెల తర్వాత ఫోటోలు పోస్ట్..

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో  పెళ్లిల్ల సీజన్ నడుస్తోంది. హీరోయిన్ లు, హీరోలు వరుసగా ఒక్కొక్కరు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవలే రకూల్ ప్రీత్ సింగ్, అక్ష పార్థసాని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  రెండు రోజుల క్రితం వరలక్ష్మీ శరత్ కుమార్  ఎంగేజ్ మెంట్ పూర్తయింది. త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారు. లేటెస్ట్ గా మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది.

 ముంబైకి చెందిన హీరోయిన్ నటాషా దోషి పెళ్లి చేసుకుంది.  బాలయ్య నటించిన జై సింహా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. శ్రీకాంత్ నటించిన కోతలరాయుడు,  కళ్యాణ్ రామ్ నటించిన ఎంతమంచివాడవురా, సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు.  గతేడాది వ్యాపారవేత్త మనన్ షాతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. 

జనవరి 31న పెళ్లి చేసుకోగా దాదాపు నెలరోజుల తర్వాత ఇవాళ  పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చింది.  అయితే పెళ్లి ఎక్కడ జరిగిందనేది మాత్రం చెప్పలేదు.  సోషల్ మీడియాలో  ఫ్యాన్స్ ,ప్రముఖులు ఈ దంపతులిద్దరికి విషెస్ చెబుతున్నారు.