ఏపీ పాలిటిక్స్ పై పూనమ్ షాకింగ్ కామెంట్స్.. ఆ నాయకుడే టార్గెట్?

ఏపీ పాలిటిక్స్ పై పూనమ్ షాకింగ్ కామెంట్స్.. ఆ నాయకుడే టార్గెట్?

నటి పూనమ్ కౌర్(Poonam kour) మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై ఆమె చేసిన ఈ కామెట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పూనమ్ చేసిన కామెంట్స్ ఏంటంటే.. "ఆంధ్రప్రదేశ్‌ మహిళలపై కొందరు ఫేక్‌ లీడర్లు ఈ మధ్య ఎక్కడలేని అభిమానాన్ని చూపిస్తున్నారు. అలాంటి ఫేక్‌ లీడర్లను అస్సలు నమ్మకండి. నిజంగా వాళ్లకు మహిళలపై అంత అభిమానం ఉంటే.. ఢిల్లీలో రెజ్లర్లు చాలా రోజుల నుండి దీక్ష చేస్తున్నారు. మరి వాళ్లకి మద్దతుగా ఒక్కమాటైనా మాట్లడలేదు. కేవలం వాళ్ల సొంత ప్రయోజనాల కోసమే ఈ నకిలీ లీడర్లు రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్‌ చేశారు పూనమ్‌.

ALSO READ :జగిత్యాల కాంగ్రెస్‌లో సర్వేల కలవరం.. 

ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక పూనమ్ చేసిన ఈ కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మా నాయకుడిని ఆదేశించే ఈ కామెంట్స్ చేసావ్ అంటూ ట్రోలింగ్స్ తో రెచ్చిపోతున్నారు. ఇక ఈ కామెట్స్ పై కూడా స్పందించారు పూనమ్.. "నాపై బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నవారు ఒకటి గుర్తుపెట్టుకోండి. నా పేరు 'కౌర్‌'.. దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. కొంచెం ఆలోచించుకోండి" అంటూ తన ఇన్స్టాలో మరో పోస్ట్‌ చేశారు.