Poonam Pandey: అయ్యో పాపం: కాంట్రవర్సీ నటి పూనం పాండే చనిపోయింది

Poonam Pandey: అయ్యో పాపం: కాంట్రవర్సీ నటి పూనం పాండే చనిపోయింది

మోడల్, వివాదాస్పద నటి, ఇంటర్నెట్ సంచలనం పూనమ్ పాండే కన్నుమూశారు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఆమె మరణించినట్లు నివేదికలు వస్తున్నాయి. గత కొంత కాలంగా సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. పూనం పాండే మృతితో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పూనమ్ పాండే తన నటన కంటే.. వివాదాస్పద ప్రకటనలతోనే తరచూ వార్తల్లో నిలిచేవారు. తన స్టైల్, బోల్డ్ లుక్స్‌తో అందరిని ఆకట్టుకునేవారు. 2013లో నషా అనే సినిమాతో పూనం పాండే సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన పాండేకు సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఆ సమయంలో సోషల్ మీడియాలో మాత్రం భాగా ప్రజాదరణ పొందింది. కాంట్రవర్సీ మాటలు, వివాదాస్పద కామెంట్లు చేస్తూ అందరిని తనవైపుకు తిప్పుకుంది.

>>> టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే.. ఆటగాళ్ల ఎదుట నగ్నంగా డాన్స్ చేస్తానంటూ ప్రకటించి సంచలనం రేపారు. 2011లో ఇండియా ప్రపంచ క్రికెట్ కప్ గెలిచింది. న్యూడ్ డాన్స్ చేస్తానంటూ ముందుకు వచ్చిన పూనం పాండేకు బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. ఆమెధైర్యాన్ని, సాహసోపేతమైన నిర్ణయాన్ని చాలా మంది మెచ్చుకున్నారు.

>>> గోవా బీచ్ లో పోర్న్ మూవీలో భాగంగా నగ్నంగా షూటింగ్ చేస్తుండగా కొందరు ఆమెపై దాడి చేశారు.

>>> శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై కోర్టులో కేసు వేసింది పూనం పాండే. తన యాప్ కోసం నన్ను వాడుకున్నారంటూ ఆరోపణలు చేశారు.