
అత్తారింటికి దారేది' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) తన ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
‘రౌండ్ 2..ఇక ఈ ప్యాంట్స్ నాకు సరిపోవు’ అని ఇన్స్టాగ్రామ్లో ప్రణీత ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్టుకి బేబీ బంప్తో ఉన్న కొన్ని ఫొటోస్ షేర్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ మేరకు ఆమె పోస్టుపై స్పందించిన సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా ప్రణీత 2022 జూన్లో పండంటి ఆడబిడ్డకు జన్మించింది. పాప పుట్టిన తర్వాత ప్రణీత మళ్లీ సినిమాల్లోను నటించింది. కాగా ఇటీవల కాలంలో తెలుగు ఢీ డ్యాన్స్ షోలో కూడా కొన్ని ఎపిసోడ్లకి ప్రణీత జడ్జీగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఉన్నపళంగా ప్రణీత ప్లేస్లోకి బ్యూటీ హన్సిక ఎంట్రీ ఇవ్వగా అందరు షాక్ అయ్యారు. ఇక ప్రణీత లేటెస్ట్ పోస్ట్ తో క్లారిటీ వచ్చేసింది.
2021లో వ్యాపారవేత్త నితిన్ రాజుతో ప్రణీత వివాహం జరిగింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది. ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ప్రణీత.. 'రభస', 'డైనమైట్' సహా పలు చిత్రాల్లో నటించింది. పవన్ కల్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది' సినిమాలో నటించి 'బాపు బొమ్మ'గా పాపులర్ అయ్యింది.