అదానీ.. ఇండియాలో నం.2 సిమెంట్​ కంపెనీ

అదానీ.. ఇండియాలో నం.2 సిమెంట్​ కంపెనీ

న్యూఢిల్లీ: హోల్సిమ్​ ద్వారా ఏసీసీ, అంబుజా సిమెంట్స్​లో వాటాలను దక్కించుకోవడం ద్వారా అదానీ గ్రూపు ఇండియాలోనే రెండో అతిపెద్ద సిమెంట్​ కంపెనీగా అవతరించింది. ఆసియాలోని అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ అంబుజా సిమెంట్స్ లిమిటెడ్,  దాని అనుబంధ ఏసీసీలో 63.19 % వాటాను దక్కించుకున్నారు. ఈ డీల్​ విలువ 10.5 బిలియన్​ డాలర్లు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలోని హోల్సిమ్ ఏజీ  సిమెంట్ వ్యాపారాలలో అదానీ గ్రూపునకు మెజారిటీ వాటా దక్కింది.  అంబుజా,  ఏసీసీలకు సంవత్సరానికి కనీసం 70 మిలియన్ టన్నుల సిమెంట్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేయగల కెపాసిటీ ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్​కు 120 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉంది. అదానీ కుటుంబం  ఆఫ్‌‌‌‌‌‌‌‌షోర్ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా  అంబుజా,  ఏసీసీలో హోల్సిమ్ లిమిటెడ్  మొత్తం వాటాను కొనుగోలు చేయడానికి  ఒప్పందాలను కుదుర్చుకుంది. అంబుజాకు ఏసీసీలో 50.05% వాటా ఉండగా, హోల్సిమ్​కు డైరెక్ట్‌‌గా ఏసీసీలో 4.48 % వాటా ఉంది.