కేసీఆర్‌‌‌‌వి సుపారీ రాజకీయాలు: అద్దంకి దయాకర్

కేసీఆర్‌‌‌‌వి సుపారీ రాజకీయాలు: అద్దంకి దయాకర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ సుపారీ రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. కేసీఆర్ తన హయాంలో తీసుకున్న తప్పు డు నిర్ణయాలు, అవినీతి, అక్రమాల వల్ల బీజేపీతో కుమ్మక్కు కావల్సి వచ్చిందన్నారు. ఎన్డీఏలోనే బీఆర్ఎస్ డీఎన్ఏ ఉందని అన్నారు.

ఈ మేరకు దయాకర్​ మంగళవారం వీడియోను రిలీజ్​ చేశారు. కాంగ్రెస్‌‌‌‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తోం దన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేస్తోందన్నారు. కాంగ్రెస్‌‌‌‌ను నష్టపర్చడానికి, బీఆర్ఎస్‌‌‌‌కు వ్యతిరేకంగా బీజేపీ నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు రెండు పార్టీలు అవగాహనతో పనిచేస్తున్నాయన్నారు.