పట్టించుకోరా.. 70 రోజులుగా వరద నీటిలోనే

పట్టించుకోరా.. 70 రోజులుగా వరద నీటిలోనే

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆదిత్యనగర్ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. 70 రోజుల నుంచి వరద నీటిలో ఉన్నా… అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధర్నా చేశారు. వరద నీళ్లను తొలగించాలని కేటీఆర్ కు ట్వీట్ చేసినా… స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు పోవడానికి చెరువు తూము ఓపెన్ చేస్తే.. తమపై ఇరిగేషన్ అధికారులు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. అసలే బురద నీళ్లతో కష్టాలు  పడుతుంటే.. పొలీస్ స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వరద నీటిని తొలగించాలని డిమాండ్ చేశారు..

ఇంటిముందు చెత్త వేయించిన కమిషనర్..అస్వస్థకు మహిళ మృతి